Saturday, November 7, 2015

కాశ్మీర్ కు కాసుల వర్షం కురిపించిన మోడీ

శ్రీనగర్ , నవంబర్ 7; జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. అభివృద్ధి కోసం రూ.80వేల కోట్లు మంజూరు చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. కశ్మీర్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. దేశంలోని ఏ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉన్నా తన స్వప్నం నెరవేరదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ ప్రజలు తన పట్ల చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో పీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆయన శ్రీనగర్‌లోని భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...