Tuesday, November 24, 2015

టి.ఆర్. ఎస్. కే వరంగల్ పట్టం..

పసునూరి దయాకర్‌కు 4, 59,092 ఓట్ల భారీ మెజారిటీ
వరంగల్ ,నవంబర్ 24; వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఆపార్టీ అభ్యర్ధి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని మించి ప్రస్తుత అభ్యర్ధి మరో 60 వేల ఓట్లు ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్ధి దయాకర్ మొత్తం 4, 59,092 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓవైపు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలకు పాల్పడినా... ఓరుగల్లు ఓటర్లు మాత్రం టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. ఓరుగల్లు టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరోమారు నిరూపించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్‌కు 6,15,403 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకు 1, 56,310 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి దేవయ్యకు 1,30,178 ఓట్లు వచ్చాయి. అలాగే ఇతరులకు 63,230 ఓట్లు వచ్చాయి. కాగా... 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరికి మూడు లక్షల తొంభై వేలకు పైగా మెజారిటీ రాగా... ప్రస్తుతం పోటీచేసిన పసునూరి దయాకర్‌కు 4, 59,092 ఓట్ల మెజారిటీ రావడం విశేషం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పసునూరి దయాకర్ అంచెలంచెలుగా ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. స్వతహాగా కళాకారుడు అయిన దయాకర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిలో పడ్డారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...