హైదరాబాద్, నవంబర్ 14: వార్షిక ఆదాయం పది లక్షలున్న వారు ఇక ఎల్పీజీ సబ్సిడీ వదులుకోవాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ దిశగా కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 30 లక్షల మంది వినియోగదారులు గ్యాస్ రాయితీని వదులుకున్నారని ఆయన తెలిపారు. పేదలకు సబ్సిడీతో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఎఫ్డీఐ పాలసీలోని 15 విభాగాల్లో కేంద్రం 35 మార్పులు చేసిందని వెంకయ్యనాయుడు అన్నారు.
.
.
No comments:
Post a Comment