న్యూఢిల్లీ, నవంబర్ 6; మాఫియా డాన్ ఛోటా రాజన్ ను సీబీఐ అధికారులు. భారీ భద్రత మధ్య బాలి నుంచి భారత్ కు తీసుకొచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానం లో లో దాదాపు 27 ఏళ్ల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టాడు రాజన్. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అతడిని విచారించనున్న ఢిల్లీ సీబీఐ ఆఫీస్ ఏరియా పూర్తిగా పోలీసుల ఆధీనమ్ లోకి వెళ్లిపోయింది. మొదట ఢిల్లీలో రాజన్ ను విచారించనున్న సీబీఐ.. తర్వాత ముంబైకి తరలించనుంది. ముంబైలో రాజన్ పై 70 కేసులు నమోదయ్యాయి. అయితే.. రాజన్ ను దేశానికి తీసుకురావడానికి ఒక రోజు ముందే… అతడిపై ఉన్న కేసులన్నింటిని సీబీఐకి బదిలీ చేసారు. ఛోటా రాజన్ రెండు కిడ్నీలు ప్రస్తుతం పనిచేయడంలేదు. ప్రతిరోజు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. దీంతో అన్నింటికి అనుకూలంగా, భద్రత ఉండే విధంగా ఢిల్లీ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్థర్ రోడ్ జైళ్లోని బ్యారక్ నంబర్ 12 లో మాఫియా డాన్ ను ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్, బాంబ్, కెమికల్ ప్రూఫ్ అయిన ఈ బ్యారక్ లో గతంలో పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్ ను ఉంచారు.చిన్న చిన్న నేరాలతో మొదలై నేర ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన చోటా రాజన్ .. 1988 లో దేశం వదిలిపారిపోయాడు. అప్పటి నుంచి అతనిపై నిఘా పెట్టిన పోలీసులకు ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో చిక్కాడు.
Friday, November 6, 2015
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment