Friday, November 6, 2015

అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా మైసూర్...

మైసూర్ ,నవంబర్ 6; ఇండియాలోనే మొదటి అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా  మైసూర్ రికార్డుల్లోకెక్కింది. అంధుల లిపి అయిన బ్రెయిలీలో రైళ్ల రాకపోకల షెడ్యూల్‌ను తయారు చేసి ఈ స్టేషన్‌లో పెట్టారు. అనుప్రయాస్ అనే స్వచ్ఛంద  సంస్థ  ఈ ప్రాజెక్ట్ ను మొదటి విడతగా మైసూర్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించింది. ఈ షెడ్యూల్ బోర్డులో రైళ్ల రాకపోకల వివరాలతో పాటు.. రైల్వే స్టేషన్‌లోని ఎంట్రీలు, ఎగ్జిట్‌లు, ప్లాట్‌ఫాములు, కౌంటర్లు, మరుగుదొడ్లు ఎటువైపు ఉన్నాయో సూచిస్తాయి. ప్రతి ప్లాట్‌ఫామ్ పైన 400 మెటాలిక్ బ్రెయిలీ గుర్తులు బిగించారు.అనుప్రయాస్ సంస్థను 27 ఏళ్ల పంచం అనే యువకుడు నడిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పంచం తన ఐదుగురు స్నేహితులతో కలిసి చేపట్టాడు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...