Tuesday, June 30, 2015

ఆర్.కె. నగర్ లో జయభేరి...

చెన్నై, జూన్‌ 30: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రికార్డు తిరగరాశారు. ఆర్‌కె నగర్‌ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జయకేతనం ఎగురవేశారు. లక్షా 50వేల పైచిలుకు మెజారిటీతో విజయం  సాధించారు .ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా తేలడంతో జయలలిత సీఎంగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆరు నెలలోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండడంతో ఆమె పోటీ చేసేందుకు వీలుగా స్థానిక అన్నాడీఎంకే శాసనసభ్యుడు రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే ఆమెపై డీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్‌, బీజేపీ సహా ప్రధాన పార్టీల అభ్యర్థులను పోటీలో నిలబెట్టలేదు. దాంతో సీపీఎం అభ్యర్థి మహేంద్రన్‌ ఆమెకు ప్రధాన పోటీగా నిలిచారు. 28 మంది స్వంత్రులు బరిలో నిలిచారు. పోటీకి దిగినవారిలో దాదాపు అందరి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...