Tuesday, June 30, 2015

రేవంత్‌ రెడ్డికి షరతులతో బెయిల్‌....

హైదరాబాద్‌, జున్‌ 30 : ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. 5 లక్షల రూపాయలు, రెండు షూరిటీలతో కూడిన బెయిల్‌ న్యాయస్థానం మంజూరు చేసింది. రేవంత్‌ రెడ్డి బెయిల్‌ ఫిటిషన్‌పై ఏసీబీ అధికారులు లిఖితపూర్వక వాదనలతో కోర్టులో కొత్త కౌంటర్‌ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ-4 నిందితుడుగా పేర్కొన్న మత్తయ్య పరారీలో ఉన్నారని, నోటీసులు అందుకున్న సండ్ర వెంకట వీరయ్య ఇంతవరకు ఏసీబీ ఎదుట హాజరు కాలేదని ఏజీ వాదనలు వినిపించారు. రూ. 50 లక్షలు, రూ. 4.50 కోట్లపై ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని, రేవంత్‌ను విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా మరికొంతమందిని విచారించాల్సిన అవసరం ఉందని ఏజీ పేర్కొన్నారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి చివరికి రేవంత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో ఏ-2, ఏ-3 నిందితులుగా ఉన్న సెబాస్టియన్‌, ఉదయసింహలకు కూడా షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...