Tuesday, June 30, 2015

మన్మోహన్ ఆదేశాలే పాటించా.. బొగ్గు కేసులో దాసరి..

న్యూఢిల్లీ,జూన్ 30; యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు మంగళవారం ఢిల్లీ లోని  సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఈ కుంభకోణంలో తన ప్రమేయం ఏమీ లేదని.. తాను కేవలం సహాయమంత్రిగానే ఉన్నానని దాసరి స్పష్టం చేశారు. అప్పటి నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగే తీసుకున్నారని దాసరి తన వాంగ్మూలంలో కోర్టుకు వెల్లడించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించడమే తప్ప తానుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. దాసరి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయస్థానం ఈ కేసు విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని దాసరిని ఆదేశించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...