Tuesday, June 23, 2015

గవర్నర్ చేతికి సెక్షన్ 8.......?

న్యూఢిల్లీ, జూన్‌ 23;ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ఉన్న ‘అధికారాలు - బాధ్యతల’పై భారత అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌-8 ప్రకారం గవర్నర్‌కు ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని అటార్నీ జనరల్‌ స్పష్టం చేశారని చెబుతున్నారు.  అటార్నీ జనరల్‌ సూచన మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ను ఓకే చేస్తే... హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలులోకి వస్తుంది.. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాబట్టి, నగరంలో రెండు రాష్ట్రాల పోలీసు బలగాలకు అధికార పరిధి ఉంటుందని , గవర్నర్‌ రెండు రాష్ట్రాల పోలీసులను పిలిపించుకుని వోట్ కు నోటు సహా ఏ కేసు నివేదికలు  అయినా పర్యవేక్షించవచ్చు’నని ముకుల్‌ రోహత్గీ కేంద్ర ప్రభుత్వానికి  సూచించినట్తు తెలిసింది..

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...