హైదరాబాద్,ఏప్రిల్ 4; నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో పోలీసులు, దుండగులుకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండగుల కాల్పుల్లో నాగరాజు అనే కానిస్టేబుల్ మృతిచెందగా, ఎస్.ఐ సిద్దయ్య , సీఐ గంగిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందితులుగా భావిస్తున్నారు.నల్గొండ జిల్లా సీతారాంపురంలో దోపిడీ దొంగలు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుండగులు పోలీసులపై కాల్పులకు దిగడంతో పోలీసులు- దొంగల మధ్య 6 రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత మండల కేంద్రమైన అర్వపల్లి చేరుకున్న ఇద్దరు దుండగులు లింగమల్లు అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని ద్విచక్రవాహనం లాక్కుని జనగాం వైపు పరారయ్యారు. పోలీసులు వెంబడించడం గమనించిన దుండగులు డి.కొత్తపల్లి గుట్టల్లోకి పరారయ్యారు. పోలీసులు డి.కొత్తపల్లి చేరుకోవడంతో అక్కడి నుంచి మోత్కూరు మండలం జానకీపురం వెళ్లారు. జానకీపురంలో పోలీసులు, దుండగుల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు దుండగులు, కానిస్టేబుల్ నాగరాజు మృతిచెందారు. కాగా నల్లగొండ ఎన్కౌంటర్లో మృతి చెందిన దుండగులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారని భువనగిరి డీఎస్పీ తెలిపారు. అంజద్ రంజాన్, అస్లాం ఆయూబ్గా వీరిని గుర్తించినట్టు చెప్పారు. గతంలో వీరికి నేర చరిత్ర ఉందని, ఇద్దరూ షార్ప్ షూటర్లని డీఎస్పీ పేర్కొన్నారు. సూర్యాపేట కాల్పుల అనంతరం తప్పించుకు తిరుగుతున్న వీరిని 48గంటల తర్వాత పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చి నట్టు ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment