Wednesday, April 1, 2015

ప్రజారాజధానిగా అమరావతి...

హైదరాబాద్‌,ఏప్రిల్ 1; అమరావతిని ప్రజారాజధానిగా నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజారాజధాని నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం ముందుకొచ్చిందని, మే 15 లోపు రాజధాని బృహత్‌ ప్రణాళిక నివేదిక అందుతుందని ఆయన తెలిపారు. రాజధాని ప్రాంతాన్ని రేడియల్‌ రోడ్లతో అనుసంధానం చేస్తామన్నారు. విజయవాడ- గుంటూరు కలుపుతూ 200 కి.మీ. మేర రింగ్‌రోడ్‌ నిర్మిస్తామని, ఎన్‌హెచ్‌ 5,9,214 జాతీయ రహదారులకు అనుసంధానంగా ఈ రింగ్‌రోడ్‌ ఉంటుందన్నారు. కృష్ణానదిపై 5 వంతెనలు నిర్మిస్తామన్నారు. అభివృద్ధి కారిడార్లుగా విశాఖ- చెన్నై, మచిలీపట్నం- కాకినాడలను తీర్చిదిద్దుతామన్నారు. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు జలరవాణా మార్గం ఏర్పాటుచేస్తామన్నారు. గుడివాడ కారిడార్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. గన్నవరంలో ఐటీ కారిడార్‌, నందిగామలో ఫార్మా కారిడార్‌ ఏర్పాటుచేస్తామన్నారు. 
పారిశ్రామిక విధానం ..
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని చంద్రబాబునాయుడు తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ, * పారిశ్రామిక అనుమతులకు సింగిల్‌ డెస్క్‌ విధానం* రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు 25 శాతం రాయితీ* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు వంద శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు* కొత్త పరిశ్రమలకు రోడ్లు, విద్యుత్‌, భూమి , భోగాపురం నుంచి కాకినాడ వరకు 3 ఎయిర్‌పోర్టులు, 2 పోర్టుల ఏర్పాటు ...కొత్త పారిశ్రామిక విధానంలోని ముఖ్య అంశాలని సి.ఎం చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...