Saturday, April 4, 2015

అమెరికాలో గుంటూరు యువతి అనుమానాస్పద మృతి ...

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 04 : అమెరికా లోని అలబామా ఏ అండ్‌ ఎం వర్సిటీలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి అనుమానాస్పదం గా మరణించింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంకు చెందిన అబ్బూరి హజరత్‌ బాబు, శివమ్మ దంపతుల మూడో కుమార్తె లావణ్య (27) 2014లో ప్లాంట్‌ అండ్‌ సాయిల్‌ సైన్స్ లో పరిశోధన చేయటానికి అలబామా ఏ అండ్‌ ఎం వర్సిటీలో చేరింది. గత  బుధవారం ఉదయం వర్సిటీ ఆవరణలో లావణ్య మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు జరుగుతోంది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...