ఆడిలైడ్,డిసెంబర్ 13; యిక్కడ జరిగిన తొలి టెస్ట్లో భారత్పై 48 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 364 పరుగుల భారీ లక్ష్యంతో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ 315 పరుగులకే ఆలౌట్ అయింది. కోహ్లీ 141, మురళి విజయ్ 99, పుజారా 21, సాహా 13, శిఖర ధావన్ 9 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్ లియాన్ 7 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. జాన్సన్ 2, హర్రీస్ ఒక వికెట్ తీశారు. విరాట్ కోహ్లీ సాధించిన రెండు శతకాలు, రికార్డులు వృథా అయ్యాయి.
స్కోరు వివరాలు; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 517/7, రెండో ఇన్నింగ్స్ 290/5 (డిక్లేర్డ్). భారత్ తొలి ఇన్నింగ్స్ 444, రెండో ఇన్నింగ్స్ 315 ఆలౌట్.విదేశీ గడ్డపై భారత్కు ఇది వరుసగా నాలుగో పరాజయం.
No comments:
Post a Comment