Friday, December 12, 2014

విడి విడిగా ఇంటర్... కలిపి ఎంసెట్

 న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ  రాష్త్రాల  లోని పరిస్థితులను  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించానని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రధానితో భేటీ అనంతరం నరసింహన్‌ మాట్లాడుతూ , రెండు రాష్త్రాల  ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారని అన్నారు. ఇరు రాష్త్రాలలో  ఇంటర్‌ పరీక్షలు విడివిడిగా జరిగినా ఎంసెట్‌ను ఉమ్మడిగా నిర్వహిస్తామని గవర్నర్‌ వెల్లడించారు. ఉద్యోగుల విభజనలో జాప్యం వల్ల సమస్యలు లేవన్నారు. విభజన చట్టం అమలులో ఎలాంటి అడ్డంకులు లేవన్న గవర్నర్‌ నరసింహన్‌ శాంతిభద్రతలకు ఢోకా లేదని స్పష్టం చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...