Tuesday, November 18, 2014

మూడు గ్రామాలను దత్తత తీసుకున్నఎమ్.పి. కవిత

హైదరాబాద్ ,నవంబర్ 18; నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలను ఎంపీ కల్వకుంట్ల కవిత దత్తత తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు సంసద్ గ్రామ్ యోజన పథకం కింద తాను తన నియోజకవర్గంలోని కందకుర్తి, మాణిక్ బండార్, జగిత్యాల గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. రానున్న రైల్వే బడ్జెట్‌లో నిజామాబాద్-పెద్దపల్లి రైల్వే లైన్ కోసం అధిక నిధులు మంజూరు చేయించుకుంటామని చెప్పారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...