హైదరాబాద్,నవంబర్ 18; ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటవుతున్న గుంటూరు జిల్లా తుళ్ళూరు పరిసర గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు , ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని హామీ ఇచ్చారు. భూ సమీకరణకు ముందుకు వచ్చే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఇప్పించి రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. రాజధానికోసం భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చే పరిశ్రమలన్నీ తొలుత రాజధాని ప్రాంతంలోనే ఉంటాయని చెప్పారు. భూములిచ్చే రైతుల కుటుంబాలలో నిరుద్యోగులుంటే వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment