Thursday, November 13, 2014

నాల్గవ వన్డే లోను మనదే గెలుపు...

కలకత్తా, నవంబర్‌ 13: కలకత్తా లో జరిగిన నాల్గవ వన్‌ డే లో శ్రీలంక పై భారత్‌ 153 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (264) ద్విశతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 43.1 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌ డబుల్‌ సెంచరీ చేయడామే గాక వన్‌ డే లో అత్యధిక స్కోర్‌ చేసిన బ్యాట్స్‌మేన్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే గతంలో వన్‌ డే లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన సేహ్వాగ్‌ స్కోర్‌ను కూడా అధిగమించి 264 పరుగులతో రోహిత్‌ మరో రికార్డు సృష్టించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...