Thursday, November 13, 2014

ఈడెన్ లో రోహిత్ వీరవిహారం ...డబుల్ సెంచరీతో కొత్త వరల్డ్ రికార్డు...

Rohit-Sharma-celeb-pix
కోల్ కతా, నవంబర్ 13; శ్రీలంకతో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో చెలరేగిపొయాడు . తుది రెండు వన్డేలకు జట్టులోకి వచ్చిన రోహిత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. కేవలం 148 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 33 ఫోర్లు, 9 సిక్సర్ల తో  రెండో శతకాన్ని పూర్తిచేశాడు. తొలుత అర్ధ సెంచరీ చేయడానికి  కొంత సమయం తీసుకున్న రోహిత్ శర్మ.. ఆ తరువాత పదునైన షాట్లతో అలరించాడు. సెంచరీ చేయడానికి 100 బంతులను ఎదుర్కొన్న రోహిత్.. మరో సెంచరీకి 50 బంతులు మాత్రమె తీసుకున్నాడు. 

ఈ తాజా డబుల్ సెంచరీతో రోహిత్ శర్మ వన్డేల్లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. గతంలో అసీస్ పై  209 పరుగులు చేసిన ఈ హైదరాబాదీ ఆటగాడు మరోసారి జూలు విదిల్చాడు. ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ వన్డే రికార్డును కూడా రోహిత్ అధిగమించాడు. గతంలో సెహ్వాగ్ పేరిట ఉన్న 219 ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టి ప్రపంచ వన్డే చరిత్రలో అరుదైన రికార్డును స్వంతం చేసుకున్నాడు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...