.
న్యూఢిల్లీ ,నవంబర్ 8; ఆదివారం జరుగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయకు మంత్రి పదవులు దక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని ఇద్దరు ఎంపీలకు తెలియజేశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఉండాలని ప్రధానమంత్రి కోరినట్టు సమాచారం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎంపీ సీటును బీజేపీ కేవసం చేసుకుంది. సుజనా చౌదరి తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడిగా వుంటూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక భూమికను నిర్వర్తిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ ఎంపీగా గెలిచారు. బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ బీజేపీ వర్గాలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాయి. అలాగే టీడీపీ - బీజేపీ స్నేహంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి మరో మంత్రి పదవి దక్కుతోంది. బండారు దత్తాత్రేయ గతంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు
No comments:
Post a Comment