Wednesday, November 19, 2014

ఎట్టకేలకు గురు రామ్ పాల్ అరెస్ట్ ...

న్యూఢిల్లీ, నవంబర్ 19; హర్యానాలోని హిస్సార్లో వివాదాస్పద స్వామీజీ  రామ్ పాల్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మంగళవారం నుంచి పోలీసులు రామ్ పాల్ ఆశ్రమంలో ప్రవేశించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన శిష్యులుగా చెప్పుకుంటున్నవారు అడ్డుకుంటున్నారు. ఈ ప్రయత్నంలో ఆరుగురు శిష్యులు మరణించారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు పోలీసులు ఆశ్రమంలోకి ప్రవేశించి రామ్ పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ పాల్ కు న్యాయస్థానం పలుమార్లు సమన్లు పంపినా స్పందన లేకపోవడంతో ఆయన్ని అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. 2006లో రామ్ పాల్ మీద కేసు నమోదైంది. ఈ కేసులో కోర్టు ఇప్పటి వరకు 63 వారంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు దేనికీ రామ్ పాల్ స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసుల మీద ఆయన శిష్యులుగా చెప్పుకుంటున్నవారు పలుమార్లు దాడులు చేశారు. మంగళవారం నాడు మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. రామ్ పాల్ మీద పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి కేంద్ర బలగాల సాయంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...