Wednesday, November 19, 2014

మూడు అంచెలుగా రాజధాని భూ సమీకరణ

హైదరాబాద్‌, నవంబర్‌ 19 : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని భూ సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ  బుధవారం సమావేశం అయింది. త్వరలోనే రాజధాని భౌగోళిక స్వరూపాన్ని విడుదల చేస్తామని  స్పష్టం చేశారు. సర్వేయర్లు ,అధికారుల నియామకానికి ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని వారు చెప్పారు. భూ సమీకరణకు చట్టబద్ధత కోసం విధి విధానాలను రూపొందిస్తున్నామమని , మూడు అంచెలుగా రాజధాని కోసం భూ సేకరణ జరుగుతుందని చెప్పారు. దీనిపై క్షేత్రస్థాయిలో రైతులు, గ్రామస్థులతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకున్నామని మంత్రులు తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...