విశాఖపట్నం, నవంబర్ 7; ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి విశాఖపట్నంలో కన్నుమూశారు. 1929 ఆగస్టు 19న విజయనగరంలో జన్మించిన ఆమె స్త్రీవాద రచయిత్రిగా తెలుగు సాహితీ లోకంలో పేరు గాంచారు . వైకుంఠపాళి, మారిన విలువలు, గ్రహణం విడిచింది వంటి నవలలు... ఆమె కోరిక, భావబంధం, ద్వివేదుల విశాలాక్షి కథలు... మలేషియా నాడు-నేడు వ్యాస సంపుటి తదితరాలు ఆమె రచనల్లో ప్రముఖమైనవి. సుమారు 200 పుస్తక సమీక్షలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ జ్యేష్ఠ సాహితీ అవార్డు, అడవిబాపిరాజు సాహితీ అవార్డు, రాజాలక్ష్మీ ఫౌండేషన్ సాహితీ అవార్డు, దిల్లీ తెలుగు అకాడమీ సాహిత్య పురస్కారం తదితరాలను పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డి. లిట్ పట్టాను పొందారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment