Thursday, November 20, 2014

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్

విజయవాడ, నవంబర్ 20;  వచ్చే ఏడాది మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది.ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం డీఎస్సీ-2014 నోటిఫికేషన్  ను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,848, లాంగ్వేజ్ పండిట్స్ 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు మంత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఫీజు చెల్లింపులు కూడా  ఆన్ లైన్ లోనే చేసే అవకాశం వుంది. ఏప్రిల్ 25 నుంచి హాల్ టిక్కెట్లు జారీ చేసి, మే 18న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 27న ఫైనల్ కీ, మే 28న ఫలితాలు వెల్లడించనున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...