హైదరాబాద్,నవంబర్ 20; హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరును పెట్టారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. బేగంపేట విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు వుండేది. అయితే శంషాబాద్ విమానాశ్రయం కట్టిన తర్వాత విమానాశ్రయం మొత్తానికీ రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అయితే విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పెట్టక పోవడం పై నిరసనలు వ్యక్తమతున్నా గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ వచ్చింది .
ఇప్పుడు బి. జె . పి. ప్రభుత్వ హయంలో పౌర విమాన యాన శాఖను దక్కించుకున్న టిడి.పి. మంత్రి అశోక గజపతి రాజు తన పలుకుబడి తో ఈ కార్యాన్ని సాధించారు
No comments:
Post a Comment