Tuesday, November 25, 2014

మోదీ దంపతులు మళ్ళి కలుస్తారా...!

అహ్మదాబాద్ నవంబర్‌ 25 : 43 ఏళ్ల కిత్రం విడిపోయిన ప్రధాని నరేంద్రమోదీ దంపతులు మళ్లీ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. మోదీ పిలిస్తే తప్పకుండా ఆయన వెంట వెళతానని మోదీ భార్య జశోదా బెన్‌ వెల్లడించారు. మోదీకి తన మీద  ప్రేమ ఉందని అందుకే ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరు రాశారని ఆమె అభిప్రాయపడ్డారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి ఉండాలని తనకు ఉందని...ఆయనతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉందని ఆయన భార్య జశోదా బెన్‌ తెలిపారు. ఆయనకు సేవ చేయాలని ఉందని, ఒక్కసారి రమ్మని పిలిస్తే సంతోషంగా ఆయన వెంట వెళతానని ఆమె చెప్పారు. నేను ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి ఒక్కసారి రమ్మని పిలవగానే మరుక్షణం ఆయన వెంట వెళ్లి జీవితాంతం తోడు ఉంటానని జశోదాబెన్‌ చెప్పారు. కానీ ముందు ఆయన తనను పిలవాలి కదా అని ఆమె అన్నారు. 
43 ఏళ్లపాటు విడిగా ఉంటున్నా... భర్తపై మమకారం తగ్గలేదని... తన పూజలన్నీ ఆయన కోసమేనని జశోదా బెన్‌ చెప్పారు. ఇప్పటికీ వారంలో 4 రోజులు ఆమె ఉపవాసం ఉంటారు. 1968లో మోదీకి 17 ఏళ్ల వయసులో జశోదా బెన్‌తో వివాహం అయింది. మూడేళ్లు తర్వాత వారిద్దరూ విడిపోయారు. తండ్రి సహకారంతో ఆమె చదువుకుని ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఆమె కొత్త జీవితం ప్రారంభించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల వరకు తన వివాహం గురించి కానీ, భార్య గురించి గానీ మోదీ ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. వడోదర స్థానం నుంచి లోక్‌సభకు మోదీ పోటీ చేస్తున్న సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య పేరు జశోదా బెన్‌ అని తొలిసారి ఆయన వెల్లడించారు. ఆఫిడవిట్‌లో భార్యగా తన పేరును మోదీ రాశారని తెలిసినప్పుడు తన భావాలను ఓ పత్రికలో ఆమె పంచుకున్నారు. చాలా సంతోషం కలిగిందని కళ్లలో నీళ్లు వచ్చాయని జశోదాబెన్‌ అన్నారు. ఆయనకు నేను అంటే ఇష్టమేనని తెలుసన్నారు. ఆందుకే ఆయన తన పేరు రాశారని ఆమె చెప్పారు. 





 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...