Sunday, November 2, 2014

కటక్ లో భారత్ శుభారంభం...


కటక్‌, నవంబర్ 2; rశ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 169 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 364 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల విజృంభనతో 39.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.టాస్‌ గెలిచిన శ్రీలంక భారత్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది.  ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌(113), రహానే(111) శతకాలతో రాణించారు  భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బౌలర్లలో రణదేవ్‌ మూడు వికెట్లు తీసుకున్నాడు. .భారత బౌలర్లు ఆది నుంచి శ్రీలంక వికెట్ల వేట కొనసాగించారు. 31 పరుగుల వద్ద దిల్షాన్‌ను ఔట్‌ చేసి లంకేయులకు షాక్‌ ఇచ్చిన భారత బౌలర్లు 109 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడగొట్టిఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. అయితే మధ్యలో జయవర్దనే(43) ఒంటరి పోరాటం చేసినా జట్టుకు భారీ స్కోరు ఇవ్వలేకపోయాడు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 4, ఉమేశ్‌ యాదవ్‌ 2, అక్షర్‌ పటేల్‌ 2, అశ్విన్‌, రైనా చెరో వికెట్‌ తీశారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...