Sunday, November 2, 2014

యూనివర్సల్‌ హెల్త్‌ ప్లాన్‌ పై కేంద్రం కసరత్తు ...

 న్యూఢిల్లీ, నవంబర్‌ 1: అమెరికాలో  మాదిరి యూనివర్సల్‌ హెల్త్‌ ప్లాన్‌ విధానాన్ని భారత్‌లో కూడా తీసుకురావాలని భావిస నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని విధివిధానాలపై ఓ ప్రత్యేక కమిటీ పని చేస్తోంది. ఈ విధానం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి శ్రీకారం చుట్టుకోనుంది. మార్చి 2019 నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించనున్నారు. దేశవ్యాప్తం గా అమలుకు 1.6 లక్షల కోట్ల రూపాయల ఖర్చయ్యే ఈ పథకం కింద మం దులు ఉచితంగా ఇస్తారు. చికిత్సలు ఉచితంగా చేస్తారు. తీవ్రమైన వ్యాధుల విషయంలో బీమా కవరేజి కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో దేశంలోని అతి పెద్ద ఆరోగ్య పథ కం ఇదే కానుంది. నేషనల్‌ హెల్త్‌ అస్యూరెన్స్‌ మిషన్‌ కింద ఆరో గ్య బీమా పథకాన్ని దశలవారీగా 2015 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ అమలు చేస్తారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...