Monday, November 17, 2014

తెలంగాణా రాష్ట్ర అధికార చిహ్నాలు ఖరారు

మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 17 : తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నాలను సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పం తంగేడుగా నిర్ణయించారు. కొత్త రాష్ట్రంలో తెలంగాణ కోణం నుంచి చిహ్నాలను ఎంపిక చేశామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 
 
రామాయణంలో జింకకు ప్రాధాన్యం ఉందని, రాముడు పాలపిట్టను దర్శించుకున్న తర్వాతే విజయం సిద్ధించిందని కేసీఆర్‌ అన్నారు. జమ్మిచెట్టు తెలంగాణ ప్రజల జీవితాలలో అంతర్భాగమని ఆయన తెలిపారు. తంగేడు పూలు సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా మహిళలు భావిస్తారని కేసీఆర్‌ చెప్పారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...