Tuesday, October 28, 2014

జగన్ తో కొణతాల తె గతెంపులు..

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 : ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత కొంత కాలంగా పార్టీ అధినేత జగన్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్న కొణతాల రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. అంతేకాకుండా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జగన్‌కు కొణతాల ఘాటైన లేఖ రాశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో వెల్లడించారు. 
 
 నువ్వెవరినీ నమ్మవు...నిన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని జగన్‌నుద్దేశించి లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి తీవ్ర దోహం జరిగిందని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులెవరూ వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. 
 
గండి బాబ్జీ వ్యవహారమే జగన్‌-కొణతాల మధ్య విభేదాలకు కారణమని తెలుస్తోంది. కొణతాలకు సన్నిహితుడైన బాబ్జీని వారం క్రితం పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్‌ పదవి నుంచి తప్పించారు. దాన్ని అవమానకరంగా భావించిన కొణతాల సన్నిహితుల దగ్గర తీవ్ర అసంతృప్తికి వ్యక్తం చేసినట్లు సమాచారం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...