Tuesday, October 28, 2014

భాజపా పంచన చేరిన కన్నా .....

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28: కాంగ్రెస్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ  మంగళవారంనాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా నేతృత్వంలో కన్నా ఢిల్లీలో బిజెపిలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఆంధ్రలో రానురాను కాంగ్రెస్‌ ప్రతిష్ఠ మరింతగా దిగజారుతూనే ఉండడంతో ఇక ఆ పార్టీ బ్రతికి బట్టకట్టే అవకాశం లేదని గుర్తించి ఆయన కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయం గురించి యోచిస్తున్నారని తెలుస్తున్నది. కన్నా ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతోనే ఉండి ఒక దశలో ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తారని భావించారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కూడా ఇతర కాంగ్రెస్‌ ఘనాపాటీలలాగానే ఓటమి చవిచూశారు. ఆయనపై ఎప్పటికపడు అవినీతి అస్త్రాలు సంధిస్తున్న రాయపాటి అప్పటికే కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన నరసారావుపేట నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.  విభజన సమయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధికి విశ్వాసపాత్రునిగా ఉండి, ఒక దశలో కిరణ్‌ స్థానంలో ముఖ్యంత్రి పీఠం అధిష్ఠించడానికి సైతం ఆమె ఆదేశాలకోసం ఎదురుచూసిన కన్నా ఇప్పుడు ఆకస్మికంగా బిజెపిలో చేరడం రాజకీయ పరిశీలకులను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఒక దశలో ఆయన వైఎస్సాఆర్‌ సీపీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా రఘువీరా రెడ్డిని పార్టీ ఎంపిక చేసినప్పటినుంచి కన్నాలో  పెరిగిన అసంప్త్రుప్తే ఈ నిర్ణయానికి కారణం అని ,తెలుస్తున్నది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...