న్యూఢిల్లీ, అక్టోబర్ 30; విత్తలోటును తగ్గించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు పొదుపు చర్యల్ని ప్రకటించింది. ఉన్నతాధికారులు విమానాల్లో ప్రథమ శ్రేణిలో ప్రయాణాలు చేయవద్దనీ, అయిదు నక్షత్రాల హోటళ్లలో బస చేయవద్దనీ, సమావేశాల కోసం వీలైన చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనీ ఆదేశించింది. కొత్త కార్ల కొనుగోలు, ఉద్యోగ నియామకాలపైనా ఆంక్షలు విధించింది. అత్యంత అవసరమైతే తప్పిస్తే సదస్సులు నిర్వహించవద్దని కేంద్రం చెప్పింది. వాణిజ్యం పెంచుకునేందుకు ఉద్దేశించినవి మినహా ఇతర ఎగ్జిబిషన్లేవీ విదేశాల్లో నిర్వహించడానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కొత్త పోస్టులపై ప్రభుత్వం పూర్తి నిషేధాన్ని విధించింది. ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న పోస్టులను అనివార్యమైతే తప్పిస్తే భర్తీ చేయరు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12.19 లక్షల కోట్లుగా ఉన్న ప్రణాళికేతర వ్యయంలో 10 శాతాన్ని తగ్గించడం, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో విత్తలోటును ఏడేళ్ల కనిష్ఠస్థాయికి (4.1 శాతానికి) తగ్గించడం కోసం ఈ చర్యలు చేపట్టారు. స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలకూ ఆంక్షలు వర్తిస్తాయి. వడ్డీలు, రుణాల చెల్లింపు, రక్షణ శాఖ అవసరాలు, జీతాలు, పింఛన్లు మాత్రం పొదుపు చర్యల వల్ల ప్రభావితం కావు. ఆయా శాఖల కార్యదర్శులు తాము చేపట్టిన పొదుపు చర్యలపై ప్రతీ మూడు నెలలకోసారి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 2012, 2013ల్లోయూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు తీసుకొంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment