Thursday, October 30, 2014

ఇక నుంచి జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

 విజయవాడ ,అక్టోబర్ 30; ఆంధ్రప్రదేశ్ అవతరణ తేదీని జూన్ 2వ తేదీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలన్న నిర్ణయంతోపాటు శ్రీశైలం జల వివాదం గురించి కూడా మంత్రివర్గం చర్చించింది. రాజధాని భూ సమీకరణపై ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం సూచించింది. తిరుమలలో అన్యమత ప్రచారంపై మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తన సింగపూర్, జపాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి వివరించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...