హైదరాబాద్, అక్టోబర్ 8 : తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తన సోదరి షర్మిలకు అప్పగించారు. తెలంగాణలో ఓదార్పు యాత్రను కూడా షర్మిలానే చేస్తారని బుధవారం హైదరాబాద్లో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ప్రకటించారు. తెలంగాణ వైసీపీ వర్కింగ్ అధ్యక్షడుగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని జగన్ అన్నారు. ప్రజా వ్యతిరేకతలో టీఆర్ఎస్ కొట్టుకుపోయే రోజు వస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో వైసీపీ పుంజుకుంటుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో చివరికి మిగిలేది కాంగ్రెస్, బీజేపీ, వైసీపీయే అని జగన్ అన్నారు. తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్ను మించిన నాయకుడు తెలంగాణలో లేరని షర్మిల అన్నారు . తెలంగాణలో రైతులకు అత్యధిక ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతోనే వైఎస్ ఉచిత విద్యుత్ను అందించారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి నేను ఉన్నానని భరోసా కల్పించిన నాయకుడు వైఎస్ అని ఆమె అన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని జగన్ అన్నారు. ప్రజా వ్యతిరేకతలో టీఆర్ఎస్ కొట్టుకుపోయే రోజు వస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో వైసీపీ పుంజుకుంటుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో చివరికి మిగిలేది కాంగ్రెస్, బీజేపీ, వైసీపీయే అని జగన్ అన్నారు. తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్ను మించిన నాయకుడు తెలంగాణలో లేరని షర్మిల అన్నారు . తెలంగాణలో రైతులకు అత్యధిక ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతోనే వైఎస్ ఉచిత విద్యుత్ను అందించారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి నేను ఉన్నానని భరోసా కల్పించిన నాయకుడు వైఎస్ అని ఆమె అన్నారు.
No comments:
Post a Comment