జమ్మూ కశ్మీర్, అక్టోబర్ 8 : జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో బుధవారం ఉదయం కూడా పాక్ సైనికుల కాల్పులు కొనసాగాయి. అంతర్జాతీయ సరిహద్దు ఉన్న 192 కిలోమీటర్ల పొడవున గత రాత్రి నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 60కి పైగా బీఎస్ఎఫ్ చెక్పోస్టులు, సుమారు 40గ్రామాలు పాక్ సైనికుల కాల్పులతో దద్దరిల్లాయి. బుధవారం ఉదయం సాంబా సెక్టార్లో ఇద్దరు భారతీయ పౌరులు మరణించారు. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లతోపాటు 17 మంది పౌరులు స్వల్పంగా గాయపడగా... మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడులకు భయపడుతున్న సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు పాక్ కాల్పులను భారత జవాన్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ భూభాగంలోని 73 సైనిక పోస్టులపై మోటార్సెల్స్లతో కాల్పులు జరిపారు. పాకిస్తాన్ సైన్యం కాల్పులు ఆపేవరకు పాక్తో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇరు సైన్యాలు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్ ప్రతిపాదించినట్లు తెలియవచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు, వాస్తవాధీనరేక వెంబడి దాడులు ఆగేవరకు ఎలాంటి చర్చలకు ఒప్పుకోవద్దంటూ భారత సైన్యానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
No comments:
Post a Comment