Tuesday, October 7, 2014

తెలంగాణాలో సర్వే ఆధారంగా ప్రత్యేక గుర్తింపు కార్డులు....

హైదరాబాద్, అక్టోబర్ 7: 
సమగ్ర సర్వే ఆధారంగా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని పథకాలకూ ఇకనుంచి రేషన్‌కార్డుతో సంబంధం ఉండదు అన్ని రకాల పింఛన్లకు ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 15 లోగా వీఆర్‌వోలకు పింఛన్ల దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొంది. వికలాంగులకు ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాలకుపైగా భూమి, వ్యాపారులకు కార్డుల నుంచి మినహాయింపు ఇస్తారు. దారిద్య్రరేఖ దిగువనున్న వారికి కుటుంబ ఆహారభద్రత కార్డులు జారీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. నిరుపేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తారు 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...