Friday, October 17, 2014

నాల్గవ వన్డేలో భారత్ గెలుపు...అర్ధంతరంగా విండీస్ టూర్ రద్దు


ధర్మశాల,అక్టోబర్ 17;  వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్   నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్‌ 48.1 ఓవర్లలో 271 పరుగులకు అలౌటైంది. వెస్టిండీస్‌ జట్టులో శ్యామూల్స్‌ (112)  మాత్రమే ఒంటరి పోరాటం చేసాడు.  భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, షమి, అక్షర్‌ పటేల్‌, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.దీంతో ఐదు వన్డేల సీరిస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యం సాధించింది.
అర్ధంతరంగా ముగిసిన విండీస్ టూర్ 
భారత్‌తో సిరీస్‌ను వెస్టిండీస్‌ రద్దు చేసుకుంది. థర్మశాలలో జరిగిన నాలుగే వన్డే యే చివరిదని విండీస్‌ బోర్డు తెలిపింది. విండీస్‌ క్రికెటర్లకు, బోర్డుకు మధ్య పారితోషికం విషయంలో విబేధాల కారణంగా  టూర్‌ను రద్దు చేసుకుంటున్నట్లు విండీస్‌ బోర్డు బీసీసీఐకు తెలిపింది. ఐదో వన్డే ,టీ-20తోపాటు మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు రద్దయ్యాయి. విండీస్‌ తప్పుకోవడంతో శ్రీలంకతో సిరీస్‌ను ఆడించేందుకు బీసీసీఐ యత్నిస్తున్నట్లు సమాచారం 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...