Saturday, October 18, 2014

తెలంగాణకు చత్తీస్ ఘడ్ కరెంట్...?

హైదరాబాద్ ,అక్టోబర్  18; తెలంగాణ రాష్త్రానికి విద్యుత్ కష్టాలు తీరే మార్గం కనిపించింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇరు రాష్త్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా ఒప్పందం కుదిరితే విద్యుత్ వచ్చేందుకు వీలవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం సహా తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కోతలు తీవ్రంగా అమలవుతున్నాయి. నగరంలో 2 నుంచి 4 గంటలు, గ్రామాల్లో అయితే దాదాపు 8 గంటల మేర విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 7-8 రూపాయల చొప్పున కొంటున్నా, అది ఏమాత్రం సరిపోవట్లేదు.

దీంతో ప్రభుత్వం గతంలో ఛత్తీస ఘడ్ తో మొదలైన చర్చలను పునరుద్ధరించింది. ఆ ప్రభుత్వం కూడా విద్యుత్ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా లైను (కారిడార్) లేకపోవడం ఓ సమస్యగా మారింది. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుని, కారిడార్ నిర్మించుకోవడం, లేదా మరేదైనా మార్గం ద్వారా విద్యుత్తు తెప్పించుకోవడం చేయాలని భావిస్తున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...