Sunday, October 19, 2014

మహారాష్ట్ర ,హర్యానా భాజపా పరం...

ముంబై, అక్టోబర్‌ 19 : మహారాష్ట్రలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. తొలిసారిగా శివసేనతో పొత్తు వీడి సాంతంగా పోటీచేసిన భాజపా మొత్తం 280 స్థానాల్లో పోటీచేసి 122 స్థానాల్లో విజయం సాధించి పూర్తి మెజార్టీకి అవసరమైన కొన్నిస్థానాలకు ముందు ఆగింది. 2009 ఎన్నికల్లో భాజపాకు 48 సీట్లు మాత్రమే వచ్చాయి. సీట్ల సర్దుబాటులో విఫలమై ఒంటరిపోరుకు మొగ్గుచూపిన శివసేన 63 స్థానాలతో సరిపెట్టుకోవలసివచ్చింది. గత ఎన్నికల్లో సేనకు లభించిన స్థానాలు 44 మాత్రమే కావడం గమనార్హం. మూడు పర్యాయాలు వరుసగా రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌,ఎన్సీపీలు కూటమినుంచి వేరుపడి ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేశాయి. కాంగ్రెస్‌కు గతంలో 82 స్థానాలుండగా ప్రస్తుత ఎన్నికల్లో 42కు పరిమితమయింది. మరోవైపు శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి గతంలో 62 స్థానాలు రాగా ఇప్పుడు 41 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎంఎన్‌ఎస్‌కు 1, ఇతరులకు 19 స్థానాలు లభించాయి.మహా ఎన్నికల్లో భాజపా విజయంతో ముఖ్యమంత్రి పీఠం భాజపాకే దక్కనుంది. మెజార్టీ రాకపోయినప్పటికీ శివసేన మద్దతు ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పొత్తు విఫలమయినప్పటికీ కేంద్రంలో శివసేన తరఫున అనంత్‌గీతే మంత్రిపదవిలో కొనసాగుతుండటం గమనార్హం. 

హర్యానాలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ

హర్యానాలో బీజేపీ స్పష్టమైన ఆధిపగ్యం కనబరిచింది. కనీస మెజారిటీ కంటే ఎక్కువ స్థానాలలో బీజేపీ విజయకేతనం ఎగురువేసింది. హర్యానా 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 47 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సింది 45 స్థానాలు... అంతకంటే ఎక్కువ చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పగ్గాలు అందించారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...