హైదరాబాద్, అక్టోబర్ 8 : ఏపీ చిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలికి కేటాయించిన 16 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఉమ్మడి రాష్ట్రంలో బంజారా హిల్స్ లో ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో నాలుగు ఎకరాలు గుడిసెల పేరిట ఆక్రమణలకు గురైంది. మిగిలిన 16 ఎకరాలు ఏపీ ఫిలం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉంది.
విభజన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీవోలకు సంబంధించిన భూములు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయగా ఏపీ ఎన్జీవోలు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో టీ. ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
No comments:
Post a Comment