వాషింగ్టన్, అక్టోబర్ 29: అమెరికా రోదసీ పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన ఒక ప్రయివేటు రాకెట్ ప్రయోగించిన ఏడు సెకండ్లలోనే పేలిపోయింది. ఈ ప్రయోగం ఫలితంగా ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదని నాసా ప్రకటించింది. ఈ ప్రయోగం ఒక రోజు ముందే జరగవలసి ఉంది. అయితే అనివార్య కారణాలవల్ల ఈ ప్రయోగాన్ని ఒక రోజు వాయిదా వేశారు.
మంగళవారం సాయంత్రం అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకున్న సమయంలో ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ప్రయోగం జరిగింది. కొన్ని వేల మంది ఈ ప్రయోగాన్ని చూస్తుండగానే ఆకాశంలో పెద్ద పేలుడు సంభవించింది. రాకెట్ ముక్కలు ముక్కలైపోయింది. రాకెట్లోని ఇంధనం మొత్తం ఒక్కసారిగా అంటుకోవడంతో ఆకాశంలో మంటలు వ్యాపించాయి. రాకెట్ శకలాలు శరవేగంగా నేలకూలాయి.
ఈ రాకెట్లో మనుషులు ఎవ్వరూ లేరు. ఈ మానవ రహిత రాకెట్ ద్వారా దాదాపు 5000 పౌండ్ల బరువు ఉన్న రకరకాల సామగ్రిని ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ కేంద్రంలో పనిచేస్తున్న వ్యోమగాములకు కావలసిన సామగ్రి కూడా ఇందులో ఉంది. అయితే ఈ ప్రయోగం విఫలమైనంత మాత్రాన ఆ వ్యోమగాములకు ఎటువంటి నష్టమూ సంభవించదని, వారికి ఇప్పటికే కావలసినంత ఆహార సామగ్రి ఉందని అధికారులు తెలియజేశారు. ఆర్బిటల్ సైన్సెస్ కార్పొరేషన్కు చెందిన ఆంటరెస్ అనే రాకెట్, అందులోని సైనస్ ఉపగ్రహం ఈ ప్రయోగంలో తునాతునకలయ్యాయి.
మంగళవారం సాయంత్రం అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకున్న సమయంలో ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ప్రయోగం జరిగింది. కొన్ని వేల మంది ఈ ప్రయోగాన్ని చూస్తుండగానే ఆకాశంలో పెద్ద పేలుడు సంభవించింది. రాకెట్ ముక్కలు ముక్కలైపోయింది. రాకెట్లోని ఇంధనం మొత్తం ఒక్కసారిగా అంటుకోవడంతో ఆకాశంలో మంటలు వ్యాపించాయి. రాకెట్ శకలాలు శరవేగంగా నేలకూలాయి.
ఈ రాకెట్లో మనుషులు ఎవ్వరూ లేరు. ఈ మానవ రహిత రాకెట్ ద్వారా దాదాపు 5000 పౌండ్ల బరువు ఉన్న రకరకాల సామగ్రిని ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ కేంద్రంలో పనిచేస్తున్న వ్యోమగాములకు కావలసిన సామగ్రి కూడా ఇందులో ఉంది. అయితే ఈ ప్రయోగం విఫలమైనంత మాత్రాన ఆ వ్యోమగాములకు ఎటువంటి నష్టమూ సంభవించదని, వారికి ఇప్పటికే కావలసినంత ఆహార సామగ్రి ఉందని అధికారులు తెలియజేశారు. ఆర్బిటల్ సైన్సెస్ కార్పొరేషన్కు చెందిన ఆంటరెస్ అనే రాకెట్, అందులోని సైనస్ ఉపగ్రహం ఈ ప్రయోగంలో తునాతునకలయ్యాయి.
No comments:
Post a Comment