Monday, October 20, 2014

తూ.గో. జిల్లాలో బాణసంచా పేలి 11 మంది మృతి..

విజయవాడ,అక్టోబర్ 20;  తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతుప్ప గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాదంలో 11 మంది మృతిచెందగా ఏడుగురు గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఐదుగురికి కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులలొ 9 మంది మహిళలు ఉన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అనుమతులు లేకుండా నడిపే బాణసంచా కేంద్రాలు మూసివేయాలని, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్ష ల పరిహారం   ప్రకటించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...