Friday, October 10, 2014

భారత్, పాక్ లకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి


స్లో,అక్టోబర్ 10; ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి ఈ ఏడాది ఇద్దరిని వరించింది. పాకిస్థాన్‌ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్‌, భారతీయ బాలల హక్కుల కార్యకర్త కైలాస్‌ సత్యార్థిలకు ఈ బహుమతి లభించింది. విదీష ప్రాంతానికి చెందిన కైలాస్‌ సత్యార్థి బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ పేరిట రెండున్నర దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు. బాలకార్మికులుగా పనిచేస్తున్న, వెట్టిచాకిరీ చేస్తున్న 80 వేల మంది బాలలను ఆయన రక్షించారు. కైలాస్‌ సత్యార్థి నోబెల్‌ బహుమతి అందుకోనున్న ఏడో భారతీయుడవుతారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా కైలాస్‌ గ్లోబల్‌ మార్చ్‌ కూడా నిర్వహించారు. ఆయన రుగ్మక్‌ అనే సంస్థను స్థాపించి బాలల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. 

కైలాస్‌ 1984లో జర్మనీ శాంతి పురస్కారం, 1995లో రాబర్డ్‌ కెనడి మానవ హక్కుల పురస్కారం, 2006లో అమెరికా ప్రభుత్వ స్వేచ్ఛా పురస్కారం అందుకున్నారు. అలాగే 2007లో ఇటాలియన్‌ సెనేట్‌ పతకం, 2009లో అమెరికా ప్రభుత్వ ప్రజాస్వామ్య పరిరక్షణ పురస్కారం లభించింది. 

పాకిస్థాన్‌కు చెందిన 17 ఏళ్ల మలాలా యూసుఫ్‌జాయ్‌ బాలికల విద్య కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్ల దాడికి గురైన ఆమెకు ఇంగ్లాండ్‌లో చికిత్స జరిగింది. అనంతరం ఆమె ఐక్యరాజ్యసమితిలో సైతం బాలికల విద్యాహక్కుపై ప్రసంగించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...