Saturday, October 11, 2014

ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా...రెండో వన్డేలో ఘనవిజయం...

న్యూఢిల్లీ,అక్టోబర్ 11; తొలి వన్డేలో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ తో  జరిగిన రెండో వన్డేలో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలమైన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు విశేషంగా రాణించి జయకేతనం ఎగురవేశారు. భారత్ విసిరిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ ఆటగాళ్లు తడబడి ఓటమి పాలైయ్యారు. విండీస్ ఆటగాళ్లలో స్మిత్ (97), బ్రేవో(26),పొలార్డ్ (40) పరుగులతో రాణించినా.. తరువాత ఆటగాళ్లు ఘోరంగా  టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 263 పరుగులు చేసింది.  ఓపెనర్లు రహానె (12),  శిఖర్ ధవన్ (1) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (62),  రైనా (62) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. అంబటి రాయుడు 32 పరుగులు చేశాడు. చివర్లో ధోనీ (51 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...