ముంబై, సెప్టెంబర్ 25: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు రద్దయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరలేదని రెండు వర్గాలు అంగీకరించాయి. విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. దీనికి బాధ్యత మీదంటే మీదనని ఇరు వర్గాలు దుమ్మెత్తి పోసుకున్నాయి.
మహారాష్ట్రలో శివసేన-బీజేపీ మధ్య గురువారం మరోసారి జరిగిన చర్చలలో బీజేపి అడిగిన 130 స్థానాలు ఇవ్వడానికి శివసేన ఒప్పుకుంది.
కానీ ఇతర మిత్రపక్షాల్లో వాటాల నుంచి ఆ సీట్లు కేటాయించింది. ఆ సమీకరణానికి చిన్న పార్టీలు ఒప్పుకోవడంలేదు. వారికి ఇప్పుడు అదనపు సీట్లు ఎక్కడి నుంచి కేటాయించాలన్న అంశంపై బీజేపీ-శివసేప మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. రెండు పార్టీలు ఒక్క సీటు అయినా వదులుకోడానికి సిద్ధంగా లేవు. ఈ రగడ ముదిరి మొత్తానికి మైత్రీబంధానికే ముప్పు వాటిల్లే పరిస్థితి ఎదురైంది. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య కూడా సయోధ్య కుదరడంలేదు.
No comments:
Post a Comment