న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 : ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల పథకం ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ప్రారంభ కార్యక్రమం గురువారం ఢిల్లీలో జరిగింది. ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారత్ను నిలపడమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ వెబ్ పోర్టల్ ప్రారంభ కార్యక్రమంలో దేశంలో పారిశ్రామిక, వాణిజ్యరంగ దిగ్గజాలు పాల్గొన్నారు.
‘‘మా దేశానికి రండి... ఇక్కడ ఉత్పత్తులు తయారుచేసుకోండి.. ప్రరంచమంతా విక్రయించుకోండి...’’ అనే నినాదంతో కేంద్రప్రభుత్వం ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రెడ్ టేపిజమ్, అవినీతి వంటి అవంతరాలు లేకుండా భారత్లో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ సులభంగా జరిగేందుకు ఈ పథకం ద్వారా వీలు కల్పిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ,
ఉపాధి అవకాశాలతో పాటే ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. అప్పుడే ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ లేదా స్వదేశీ పెట్టుబడుదారులు ఎవరైనా పారిశ్రామిక అభివృద్ధిపైన... ఉత్పాదక రంగంమీద దృష్టి సారించకపోతే.. ఈ చక్రం ఎప్పటికీ పూర్తీ కాదని ఆయన అన్నారు.
ఇది ప్రారంభం మాత్రమేనని, డీలైసెన్సింగ్, డీ రెగ్యులేషన్ వంటి విప్లవాత్మక మార్పులకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
మేక్ ఇన్ ఇండియా పథకం గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా బీరో డిఫెక్ట్, బీరో ఎఫెక్ట్ విధానాన్ని అమలు చేయనున్నారు. విదేశీ పెట్టుబడుదారులు భారత్లో అడుగుపెట్టడానికి వీలుగా వాణిజ్య మంత్రిత్వ శాఖలు ఇన్వెస్ట్ ఇండియా అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. వెబ్ పోర్టల్ ద్వారా వచ్చే ప్రశ్నలకు మూడు రోజులలోగా జవాబులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇక ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు 25 కీలక రంగాలను గుర్తించింది.
No comments:
Post a Comment