Thursday, September 25, 2014

చంద్రబాబుపై అలిపిరి దాడి కేసులో తుది తీర్పు...ముగ్గురికి జైలు శిక్ష

తిరుపతి, సెప్టెంబర్‌ 25 : 2003లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో తాజాగా మరో ముగ్గురిని దోషులుగా నిర్థారిస్తూ తిరుపతి అదనపు సెషన్స్‌ కోర్టు గురువారం నాడు తీర్పు ఇచ్చింది. రామ్మోహన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రాలను దోషులుగా నిర్థారించిన కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో పాటు రూ. 500లు జరిమానా విధించింది. 
 
మొదటి దశ విచారణలో కింది కోర్టు నలుగురికి శిక్ష వేసింది. అయితే వీరు హైకోర్టుకు అపీల్‌ చేసుకున్నారు. సరైన ఆధారాలు లేవన్న న్యాయస్థానం సాగర్‌, గంగిరెడ్డిలను నిర్ధోషులుగా నిర్ణయించి విడుదల చేసింది. వీరిలో గంగిరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్‌. ఇటీవల తిరుమలలో పట్టుపడిన మావోయిస్టు దామోదరం కూడా అలిపిరి దాడి కేసు నిందితుడుగా ఉన్నాడు. ఈయనపై ప్రత్యేకంగా విచాచణ జరుగుతోంది. 
అయితే గత నాలుగేళ్లుగా జనజీవన స్రవంతిలో ఉన్నామని ఈ శిక్ష వల్ల సమాజానికి తప్పుడు సమచారం వెళ్లే అవకాశం ఉందని నిందితులు కోర్టుకు తెలిపారు. నిందుతుడు రామ్మోహన్‌రెడ్డి తాను గత ఏడేళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నానని, ఈ శిక్ష వల్ల తన జీవితం దెబ్బతింటుదని కోర్టుకు విజ్ఞప్తి చేయగా, దీనిపై స్పందించిన న్యాయమూర్తి ముందుగా అనుకున్న దాని కంటే శిక్షను తగ్గిస్తూ తీర్పునిచ్చారు. అలాగే నిందితులకు అప్పీలుకు వెళ్లే అవకాశాన్ని కూడా న్యాయమూర్తి కల్పించారు. 
 
ఈ కేసులో మొత్తం 33 మందిపై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. మొదటి తీర్పులో ఇద్దరు, రెండువ తీర్పులో ముగ్గురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులకు రామ్మోహన్‌ రెడ్డి ఆశ్రయం కల్పించారని, నర్సింహారెడ్డి, చంద్రాలు యాక్షన్‌ టీంకు జిలిటెన్‌స్టిక్స్‌ అందించినట్లు తెలుస్తోంది. 
 
2003 అక్టోబర్‌ 1న తిరుమల శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయం తెలిసందే. ఈ కేసులో దర్యాప్తు సంస్థ మొత్తం 33 మందిపై కేసులు నమోదు చేయగా వారిలో 29మంది మావోయిస్టులుగా పేర్కొంది. ఈ కేసులో మొత్తం 96 మంది సాక్షులను దర్యాప్తు సంస్థ విచారించింది. ఈ కేసుకు సంబంధించి 2012 ఆగష్టులో కోర్టు మొదటి విడత తీర్పును వెల్లడించింది. మొత్తం నలుగురు ముద్దాయిల్లో ఇద్దరికి కోర్టు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...