తిరుపతి, సెప్టెంబర్ 25 : 2003లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో తాజాగా మరో ముగ్గురిని దోషులుగా నిర్థారిస్తూ తిరుపతి అదనపు సెషన్స్ కోర్టు గురువారం నాడు తీర్పు ఇచ్చింది. రామ్మోహన్రెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రాలను దోషులుగా నిర్థారించిన కోర్టు 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో పాటు రూ. 500లు జరిమానా విధించింది.
అయితే గత నాలుగేళ్లుగా జనజీవన స్రవంతిలో ఉన్నామని ఈ శిక్ష వల్ల సమాజానికి తప్పుడు సమచారం వెళ్లే అవకాశం ఉందని నిందితులు కోర్టుకు తెలిపారు. నిందుతుడు రామ్మోహన్రెడ్డి తాను గత ఏడేళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నానని, ఈ శిక్ష వల్ల తన జీవితం దెబ్బతింటుదని కోర్టుకు విజ్ఞప్తి చేయగా, దీనిపై స్పందించిన న్యాయమూర్తి ముందుగా అనుకున్న దాని కంటే శిక్షను తగ్గిస్తూ తీర్పునిచ్చారు. అలాగే నిందితులకు అప్పీలుకు వెళ్లే అవకాశాన్ని కూడా న్యాయమూర్తి కల్పించారు.
ఈ కేసులో మొత్తం 33 మందిపై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. మొదటి తీర్పులో ఇద్దరు, రెండువ తీర్పులో ముగ్గురికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులకు రామ్మోహన్ రెడ్డి ఆశ్రయం కల్పించారని, నర్సింహారెడ్డి, చంద్రాలు యాక్షన్ టీంకు జిలిటెన్స్టిక్స్ అందించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment