Thursday, September 25, 2014

శివసేన, బీజేపీబాటలోనే కాంగ్రెస్, ఎన్.సి.పీ.

ముంబై, సెప్టెంబర్ 25:మహారాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు గందరగోళంగా మారాయి.. 25 ఏళ్లగా  శివసేనతో సాగుతున్న ఎన్నికల పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకోవడం సంచలనం రేపింది. శివసేన, బీజేపీల బాటలోనే కాంగ్రెస్, ఎన్సీపీ మైత్రికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. 
 
మహారాష్ట్ర ప్రభుత్వానికి రేపు మద్దతు ఉపసంహరణపై గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు లేఖ ఇవ్వనున్నట్టు ఎన్సీపీ నేతలు ఓ ప్రకటన చేశారు. మద్దతు ఉపసంహరణకు శుక్రవారం లేఖ ఇస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మీడియాకు వెల్లడించారు. 
 
సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ వల్లే పొత్తు కుదరడం లేదని పవార్ ఆరోపించారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లా చవాన్ వ్యవహరించడం లేదని అజిత్ పవార్ నిప్పులు చెరిగారు. 
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...