Friday, September 26, 2014

పెట్రేగిన షరీఫ్... కాశ్మీర్ పై ప్లెబిసైట్ కు డిమాండ్...

న్యూ యార్క్‌, సెప్టెంబర్‌ 26 : పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారంనాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌ను లక్ష్యం చేసుకుంటూ  కాశ్మీర్ విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారం పాకిస్తాన్‌కు చాలా చాలా కీలకమైనదని ఆయన అంటూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తెలియాలంటే ప్లెబిసైట్‌ నిర్వహించాలని 
ఆరు దశాబ్దాల క్రితం కాశ్మీర్ లో ప్లెబిసైట్‌ నిర్వహించాలని ఐక్య రాజ్య సమితి నిర్ణయించిందని, ఇప్పటికీ అది జరగలేదని ఆయన సమితిని తప్పు పట్టారు. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణమైన భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి సమితి తమ తీర్మానాన్ని అమలు చేయాలని, అందుకు తాము కలిసికట్టుగా ముందుకు వ స్తామని ఆయన అన్నారు. కశ్మీరీలు దురాక్రమణలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 

భారత ప్రధాని న్యూ యార్క్‌ చేరుకున్న అరగంటకే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ప్రసంగం ప్రారంభమైంది. ఇటీవల జరగవలసిన కీలకమైన సమావేశం జరగలేదని, ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం అనీ ఆయన భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ సమావేశం రద్దు కావడానికి భారత్‌దే బాధ్యత అని కూడా నవాజ్‌ అన్నారు. 

ఇరుగుపొరుగు దేశాలతో తమకు సత్సంబంధాలు కావాలని ఆయన పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్య సమితి కొత్తగా ఎవరికీ శాశ్వత సభ్యత్వం ఇవ్వరాదని, దానివల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని కూడా సమితిని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో సైతం తాము సత్సంబంధాలు, సహకారాలను కోరుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులపై తమ పోరాటం కొనసాగుతున్నదని ఆయన చెప్పారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...