Friday, September 26, 2014

న్యూయార్క్ చేరిన మోడీ...

న్యూ యార్క్‌, సెప్టెంబర్‌ 26 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు న్యూ యార్క్‌ చేరుకున్నారు. ఆయన అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూ యార్క్‌ చేరుకున్నారు. 

ప్రధాని విమానం నుంచి క్రిందికి దిగివచ్చి అధికారులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన అధికారిక వాహనంలో బస కు బయలుదేరారు. మోదీ ఐదు రోజులపాటు అమెరికాలో ఉంటారు. శనివారంనాడు ఆయన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తారు. 

మోదీ ఆదివారంనాడు మేడిసన్‌లో ప్రసంగిస్తారు. మోదీ రెండు రోజులపాటు న్యూయార్క్  లో గడిపిన అనంతరం వాషింగ్టన్‌ వెళ్తారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో కీలకమైన చర్చలు జరుపుతారు. ఆయన ఒబామాతో రెండు సార్లు సమావేసమవుతారు. 

అమెరికా ప్రభుత్వం నుంచి ఈ పర్యటనలో భారత్‌కు పెద్దగా పెట్టుబడుల హామీలు రాకపోవచ్చు గాని, ప్రయివేటు కంపెనీలనుంచి మాత్రం పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉంది. అయితే ఈ పెట్టుబడిదారులకు భారత్‌లో ప్రస్తుతం అధికార స్థాయిలో అమలులో ఉన్న పద్ధతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటి గురించే వారు ఎక్కువగా మోదీతో చర్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...