Friday, September 26, 2014

ఎన్. సి.పి. మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో మహారాష్ట్ర సర్కార్....సి.ఎం. రాజీనామా

ముంబై , సెప్టెంబర్ 26: మరాఠా రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలు కావడం, నామినేషన్ల దాఖలుకు కూడా సమయం మరొక్కరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఎం చవాన్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది.

మహారాష్ట్రలో ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయనగా రెండు ప్రధాన కూటములలోను విభేదాలు వచ్చి రెండు కూటములు విడిపోయిన విషయం తెలిసిందే. అటు బీజేపీ - శివసేన, ఇటు కాంగ్రెస్ - ఎన్సీపీ రెండూ విడిపోయాయి. అదే తరుణంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్సీపీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో మైనారిటీలో పడిన ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం లేకపోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...